కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఈనెల మొదటి వారం నుంచే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నాలుగు రోజుల క్రితం సిర్పూర్(యు) మండలంలో 7.4 డిగ్రీల టెంపరేచర్ నమోదు కాగా.. మంగళవారం 14.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తెల్లవారుజామున మంచు కురుస్తుండటంతో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటున్నది. అటవీ ప్రాంతాల్లో మాత్రం ఉదయం 10 గంటలు దాటినా చలి తగ్గడం లేదు.