హైదరాబాద్ : రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి కలెక్టర్శరత్, నల్లగొండ కలెక్టర్ రాహుల్ శర్మ, గద్వాల కలెక్టర్గా కోయ శ్రీహర్ష, సిద్దిపేట కలెక్టర్గా ప్రశాంత్ జీవన్ పాటిల్ను బదిలీచేసింది. పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్గా హనుమంతరావు, కుమ్రంభీం ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్గా చహత్ రాజ్పాయ్, ఉట్నూర్ ఐటీడీఏ పీవోగా కర్నటి వరుణ్రెడ్డి, ఏటూరు నాగారం పీవోగా అంకిత్ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.