హైదరాబాద్ : రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్లకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 1997 కేడర్కు చెందిన శైలజా రామయ్యార్, అహ్మద్ నదీమ్, ఎన్ శ్రీధర్, ఎం వీరబ్రహ్మయ్యను ముఖ్య కార్యదర్శులుగా పదోన్నతి కల్పించింది. ప్రస్తుతం వారు కొనసాగుతున్న చోటనే కొనసాగించింది. 2009 బ్యాచ్కు చెందిన సర్ఫరాజ్ అహ్మద్, ఎన్ సత్యనారాయణ, అర్విందర్ సింగ్, ఎం ప్రశాంతికి సెలక్షన్ గ్రేడ్ (పే-13 మ్యాటిక్స్)కు ప్రమోట్ చేసింది. అలాగే కే శశాంక, శృతిఓజా, సీహెచ్ శివలింగయ్య, వీ వెంకటేశ్వర్లు, హనుమంతరావు, అమోయ్కుమార్, కే హైమావతి, ఎం హరితను జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ (లెవెల్ 12 పే మ్యాటిక్స్) పదోన్నతి ఇచ్చింది. రిజ్వాన్ భాషా, అనుదీప్ దురిశెట్టి, కోయ శ్రీహర్ష, అభిలాష అభినవ్, కుమార్ దీపక్, ఆదర్శ్ సురభి, హేమంత్ బోర్కండే, తేజస్ నంద్లాల్ పవార్ను సూపర్ టైం స్కేల్కు ప్రమోట్ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. 2004 బ్యాచ్కు చెందిన తరుణ్జోషి, శివకుమార్, కమలాసన్రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్కు ఐజీలుగా పదోన్నతి కల్పించింది. కమలాసన్రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని, మిగతా అధికారులను ప్రస్తుతం ఉన్న పోస్టుల్లోనే కొనసాగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే 2009 బ్యాచ్కు చెందిన అబర్కిశోర్ఝా, రెమా రాజేశ్వరికి సెలక్షన్ గ్రేడ్ పదోన్నతి ఇచ్చింది. 1997 బ్యాచ్కు చెందిన తఖ్ఫీర్ ఇక్బాల్కు డీఐజీగా పదోన్నతి కల్పించింది. 1997 బ్యాచ్ విజయ్కుమార్, నాగిరెడ్డికి, దేవేంద్ర సింగ్ చౌహాన్, సంజయ్ జైన్కు అదనపు డీజీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.