మన్నెగూడ: మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో టీ(బీ)ఆర్ఎస్లో చేరారు. మునుగోడు పరిధిలోని వట్టిపల్లి, కొండూరు, రాజంపేట తండాకు చెందిన 300 మందికిపైగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకున్నారు. వారందరినీ మంత్రి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఇవాళ వట్టిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామ ప్రజలతో ఇబ్రహీంపట్నం, మన్నెగూడల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురిని పార్టీలో చేర్చుకున్నారు. చౌటుప్పల్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు ఎడ్ల మహెందర్ రెడ్డి కూడా మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీ(బీ)ఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.