Narayanpet | నారాయణపేట : పచ్చి పులుసుతో భోజనం చేసిన ఓ కుటుంబంలోని ఏడుగురు సభ్యులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మక్తల్ నియోజకవర్గంలోని ఉట్కూర్ మండలం చిన్నపొర్ల గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.
సాధారణంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎండాకాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో పచ్చి పులుసు ఉంటుంది. చిన్నపొర్ల గ్రామానికి చెందిన ఓ కుటుంబం కూడా మంగళవారం రాత్రి పచ్చి పులుసు తయారు చేశారు. ఇక రాత్రి భోజనం పచ్చి పులుసుతో కలిపి తిన్నారు. కాసేపటికే కుటుంబంలోని ఏడుగురు సభ్యులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో గ్రామస్తులు వారిని నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఒక్కొక్కరు కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు.