సిద్దిపేట :సెర్ప్ ఉద్యోగుల(SERP employees)కు పే స్కేల్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని బ్లాక్ ఆఫీస్ చౌరస్తాలో సెర్ప్ జేఏసీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు(Minister Harish Rao) చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు .
ఈ సందర్భంగా సెర్ప్ జేఏసీ(SERP JAC Leaders) నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ ప్రకటించడం సంతోషకరమని అన్నారు. సెర్ప్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో సెల్ఫ్ ఉద్యోగులు కరుణాకర్ రావు, వాసుదేవ్ ఆంజనేయులు, శ్రీనివాస్ ,మైపాల్, చంద్రయ్య, శ్రీనివాస్ రెడ్డి, కొమురయ్య, విజయనిర్మల, కవిత తదితరులు పాల్గొన్నారు.
వేములవాడలో..
పే స్కేల్ వర్తింప చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని వేములవాడలో సెర్ప్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. పే స్కేల్ జీవో ఇప్పించిన మంత్రులు కేటీఆర్(KTR), హరీశ్రావు(Harish RAO), దయాకర్ రావు(Dayakar Rao) లకుప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు రడం చంద్రయ్య, సూదుల రాజు, జుట్టు సుదర్శన్, బత్తిని పరశురాములు, లింగం గౌడ్ రాజు, హరికృష్ణ, పురుషోత్తం, మల్లేశ్, సత్యానందం పరుశురాములు తదితరులు పాల్గొన్నారు.