Minister Dayakar Rao | తెలంగాణ ప్రభుత్వం మహిళ సాధికారత కోసం పాటుపడుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సెర్ప్ ఉద్యోగులు సైతం ఎంతో కృషి చేశారని, ఇందుకోసమే వారికి పేస్కేల్ ఇస్తూ జీవో 11 విడుదల చేయడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. దేవరుప్పుల మండల కేంద్రంలో ఆదివారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి దయాకర్రావు ఉద్యోగులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. దాదాపు 25 ఏళ్లుగా సెర్ప్ ఉద్యోగులు ఎదురుచూస్తున్న పే స్కేల్ పెంచే ప్రయత్నం ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. మనసున్న మహారాజు సీఎం కేసీఆర్ మాత్రమే ఆ సాహసం చేశారన్నారు.
తెలంగాణవ్యాప్తంగా 3,794 మంది సెర్ప్ ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ కొత్త పేస్కేల్ సీఎం కేసీఆర్ ఇవ్వడంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు తోడ్పాటునందించారని వెల్లడించారు. త్వరలో ఐకేపీ వీఓలకు సముచిత న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని, సరైన సమయంలో సీఎం కేసీఆర్ సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లిని సెర్ప్ రాష్ట్ర ప్రతినిధులు ఘనంగా సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సెర్ప్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్రెడి, రాష్ట్ర కన్వీనర్ ఏపూరి సోమయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు సుభాష్, రామయ్య, నర్సప్ప, రాజప్ప, జనగామ జిల్లా అధ్యక్షుడు సూత్రపు సంపత్ తదితరులు పాల్గొన్నారు.