హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిపై అధ్యయనం చేసేందుకు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్), జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ఆధ్వర్యంలో మంగళవారం నుంచి సీరో–ప్రివెలెన్స్ సర్వే నిర్వహించనున్నారు.
ప్రతి జిల్లాలో సాధారణ ప్రజలు, హెల్త్కేర్ వర్కర్ల నుంచి రక్త నమూనాలు సేకరించి కొవిడ్, ఐజీజీ ప్రతిరక్షకాల (యాంటీబాడీ)ను పరీక్షించనున్నారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సమన్వయంతో 330 గ్రామాల్లో ఇంటింటి సర్వే చేయనున్నారు.
ప్రతి జిల్లా నుంచి 10 గ్రామాలను ర్యాండమ్గా ఎం పిక చేసి, గ్రామానికి 40 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 16 వేల మంది నుంచి శాంపిల్స్ సేకరిస్తామని ఎన్ఐఎన్ సీనియర్ శాస్త్రవేత, సర్వే సమన్వయకర్త డాక్టర్ లక్ష్శయ్య తెలిపారు.
రాష్ట్రంలో మొత్తం 20 బృందాలు ఇందులో పాల్గొంటాయని ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత తెలిపారు. మూడు వారాల్లో సర్వే పూర్తి చేస్తామని పేర్కొన్నారు.