కోరుట్ల, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): ఎప్పుడూ నోటిదురుసుతో వార్తల్లో నిలిచే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకూ రాజకీయం తెలుసునని, ఎన్నికల తర్వాత తాము ఎమ్మెల్యేలను కొంటామని అన్నారు. కోరుట్లలో నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత బీజేపీలోకి ఎమ్మెల్యేలు క్యూకడతారని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేలను కొనడం తమకు తెలుసునని.. అలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వ్యాఖ్యానించారు. ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలతో కాషాయ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. అంటే అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసింది వాస్తవమేనని ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలతో తేటతెల్లమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.