హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ నూతన జాయింట్ డైరెక్టర్గా కే అపూర్వరావు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బస్భవన్లోని తన చాంబర్లో ఆమె మంగళవారం బాధ్యతలు చేపట్టారు. సీఐడీ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న ఆమెను ఆర్టీసీ జేడీగా ప్రభుత్వం సోమవారం నియమించింది.
హైదరాబాద్కు చెందిన ఆమె.. 2014 ఐపీఎస్ బ్యాచ్ అధికారిణి. వనపర్తి, గద్వాల, నల్లగొండ జిల్లాలకు గతంలో ఎస్పీగా పనిచేశారు. టీఎస్ఆర్టీసీకి జాయింట్ డైరెక్టర్గా ఒక మహిళా ఐపీఎస్ నియమితులవడం ఇదే తొలిసారి. బాధ్యతలు స్వీకరించిన అపూర్వరావుకు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్, ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు.