యాదాద్రి, నవంబర్ 11: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించారని కాంగ్రెస్ సీనియర్ నేత కే జానారెడ్డి కొనియాడారు. శుక్రవారం ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు గర్వించేలా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారంటూ ప్రశంసించారు.