నర్సంపేట, మే 5: కొవిడ్పై భయాందోళన చెందాల్సినవసరం లేదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సూచించారు. బుధవారం నర్సంపేటలో కలెక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. అనంతరం నర్సంపేట ఏరియా దవాఖానలో వైద్యులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల వారీగా నమోదవుతున్న కేసుల రికవరీ శాతం, మరణాల రేటు అంశాలపై చర్చించారు. నర్సంపేట ఏరియా దవాఖానలో ఆక్సిజన్తో కూడిన 30 పడకలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. పట్టణంలో షా పులు నిర్ణిత సమయంలో ఓపెన్ చేసేలా వ్యాపారవర్గాలతో చర్చించి, నిర్ణయించాలని కలెక్టర్కు సూచించారు. డీహెంహెచ్వో మధుసూదన్, అడిషనల్ డీఎంహెచ్వో ప్రకాశ్, ఆర్డీ వో పవన్కుమార్, ఏసీపీ ఫణీందర్, కమిషనర్ విద్యాధర్, సూపరింటెండెంట్ గోపాల్, ఓడీసీఎంఎస్ చైర్మన్గుగులోత్ రామస్వామినాయక్, జడ్పీవైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, జడ్పీఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
కరోనా బాధితులకు ప్రభుత్వం అండ : ఎమ్మెల్యే రమేశ్
వర్ధన్నపేట: కరోనా బాధితులకు రాష్ట్ర ప్రభుత్వ అండగా ఉం టుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేర్కొన్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్ధన్నపేట మండల పరిధిలోని ఇల్లంద, దమ్మన్నపేట, ల్యాబర్తి, వర్ధన్నపేటలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నందున అన్ని విధాలా చర్యలు చేపడుతున్నామన్నారు. మండలంలోని ఇల్లంద గ్రామంలో కరోనాతో టీఆర్ఎస్ కార్యకర్త మునుకుంట్ల బచ్చయ్య(54) మృతి చెందడంతో ఎమ్మెల్యే రమేశ్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే వర్ధన్నపేట పట్టణ సమీపంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తిలక్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆయన వెంట జడ్పీటీసీ మార్గం భిక్షపతి, టీఆర్ఎస్ నాయకులు తూళ్ల కుమారాస్వామి, సిలువేరు కుమారస్వామి, కే ఎలేందర్రెడ్డి, తుమ్మల రవీందర్, సుధాకర్, శ్రీనివాస్ ఉన్నారు.