శంషాబాద్ రూరల్, జనవరి 21: శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం పెద్ద మొత్తంలో హెరాయిన్ డ్రగ్ పట్టుబడింది. సూట్కేసు అడుగుభాగంలో దాచి అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న రూ.41 కోట్ల విలువైన డ్రగ్స్ను అధికారులు సీజ్ చేశారు. నిందితురాలిని జాంబియాకు చెందిన లుసాకాగా గుర్తించారు. కస్టమ్స్ అధికారుల వివరాల ప్రకారం.. జింబాబ్వే నుంచి సింగపూర్ మీదుగా హైదరాబాద్ (శంషాబాద్) ఎయిర్పోర్టుకు వచ్చిన దక్షిణ ఆఫ్రికాలోని జాంబియాకు చెందిన మహిళపై అనుమానంతో ఆమెతోపాటు లగేజీని అధికారులు తనిఖీ చేశారు.
సూట్కేసులోని డాక్యుమెంట్ ఫోల్డర్లో దాచి తీసుకొస్తున్న 5.92 కిలోల హెరాయిన్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ దాదాపు రూ.41.4 కోట్ల ఉంటుందని అంచనా. తన హ్యాండ్ బ్యాగులో దాచుకొని డ్రగ్స్ తీసుకొస్తున్న సౌతాఫ్రికాకు చెందిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు.