చౌటుప్పల్, జూన్ 9 : గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న మహిళతోపాటు కొనుగోలు చేసిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.లక్షా 6వేల విలువైన డ్రగ్స్, రెండు కార్లు, రూ.60వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. చౌటుప్పల్లోని ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ నారాయణరెడ్డి గురువారం వివరాలు వెల్లడించారు.
మణిపూర్ రాష్ట్రం చందల్ జిల్లాకు చెందిన డయానా లెచాంగో చారవ్ తన భర్త ఉచే జస్టస్తో కలిసి గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సరఫరా చేస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు చేతన్, ఆదిత్యకు డ్రగ్స్ సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
వారిని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్హెచ్-9 హోటల్ సమీపానికి రావాలని డయానా సూచించింది. దీంతో వారు గ్రడ్స్ తీసుకునేందుకు గురువారం ఉదయం ఎన్హెచ్-9 హోటల్ సమీపానికి రాగా.. డయానా అప్పటికే వారి కోసం అక్కడ ఎదురుచూస్తుంది.
పక్కా సమాచారం అందుకున్న చౌటుప్పల్ పోలీసులు వారిని వల పన్ని పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు డీసీపీ తెలిపారు. డ్రగ్స్ సరఫరా చేస్తే ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. సమావేశంలో ఏసీపీ నూకల ఉదయ్రెడ్డి, సీఐ ఎన్.శ్రీనివాస్, ఎస్ఐ అనిల్ ఉన్నారు.