ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలోని ఓ గోదాంలో నిల్వ ఉంచిన రెండు వేల కుక్కర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కుక్కర్లపై కాంగ్రెస్ నేత కంది సంజీవరెడ్డి ఫొటోలు ముద్రించి ఉండటం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న ఆయన ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కుక్కర్లు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తున్నది.
తమకు వచ్చిన సమాచారం మేరకు గోదాం పై దాడి నిర్వహించగా.. పెద్ద మొత్తంలో అక్రమంగా నిల్వ చేసిన ప్రెషర్ కుక్కర్లు లభించాయని వన్ టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు. ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా నిలువ ఉంచిన వీటిని స్వాధీనం చేసుకొని కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు అప్పచెప్పుతామని తెలిపారు.