హైదరాబాద్ : శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కువైట్ నుంచి హైదరాబాద్కు వచ్చిన శ్రీనివాస్, అమరగొండ శ్రీనివాస్ అనే ఇద్దరు ప్రయాణికుల నుంచి 388 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ రూ.6,15,519 ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.