శేరిలింగంపల్లి, జూలై 16: గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో విచారణ నిమిత్తం తీసుకువచ్చిన ఓ సెక్యూరిటీ గార్డు మృతిచెందాడు. బీహార్కు చెందిన నితీష్ (32), బిట్టు, వికాస్ నానక్రాంగూడ లేబర్ క్యాంపులో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి 11 గంటలకు కూలీలు లేబర్ క్యాంపు నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ గార్డులు అడ్డుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు ముగ్గురు సెక్యూరిటీ గార్డులను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం పోలీస్స్టేషన్లో కూర్చుని ఉన్న సెక్యూరిటీ గార్డు నితీష్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే పోలీస్స్టేషన్ సిబ్బంది సీపీఆర్ చేసి సమీపంలోని హిమగిరి దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్యులు తెలిపారు. నితీష్ ఛాతి నొప్పితో మృతిచెందినట్టు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు.