వరంగల్ రూరల్ : చెన్నారావుపేట మండలంలోని ధర్మతండా వద్ద అనుమతి లేని నకిలీ మిరప విత్తనాల ప్యాకెట్లను వ్యవసాయశాఖ అధికారులు పట్టుకున్నారు. ఓ వ్యక్తి అనుమతి లేని మిరప విత్తనాలను కారులో తెచ్చి అమ్ముతున్నాడని అందిన సమాచారంతో వ్యవసాయ శాఖ అధికారులు ధర్మతండా చేరుకున్నారు. గమనించిన నకిలీ మిరప విత్తనాల విక్రేత తప్పించుకుని తన కారులో పారిపోయాడు. అతను వదిలివెళ్లిన పది నకిలీ మిరప విత్తనాల ప్యాకెట్లను వ్యవసాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఇవి కూడా చదవండి..
ఘనంగా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు
చిరు వ్యాపారుల కష్టాలకు ఇక చెల్లు చీటీ : మంత్రి హరీశ్ రావు
మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలి
తప్పు ఒప్పుకున్న బెలారస్ జర్నలిస్టు..
సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
దోషులను కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సత్యవతి