Godavari | గోదావరి నది మహోగ్ర రూపం దాలుస్తున్నది. భారీ వర్షాలకు పరీవాహక ప్రాంతాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భద్రాచలం వద్ద గోదావరి 48 అడుగుల మేర ప్రవహిస్తున్నది. మధ్యాహ్నం 44 అడుగులు దాటగా.. అధికారులు తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 48 అడుగులకు చేరితో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
పరిసర ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షాలు కొనసాగుతున్నందున ఇంకా గోదావరిలో ఇంకా ప్రవాహం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఇప్పటికే ఆలయ పరిసరాల్లోకి వరద నీరు చేరింది. అన్నదాన సంత్రంలోకి వాన నీరు వచ్చింది. వరద నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. గంటలు గడిచే కొద్ది నదిలో ప్రవాహం పెరుగుతున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
మరో వైపు భద్రాద్రి జిల్లాలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా పినపాక మండలం కరకగూడెంలో 22 సెంటీమీటర్ల వర్షాపాతం రికార్డయ్యింది. ములకలపల్లి మండలంలో వాగుతుండగా మహిళ గల్లంతయ్యింది. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు.