హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Session) రెండో రోజుకు చేరుకోనున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించనున్నారు. చర్చకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. దానిని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి బలపరుస్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చర్చలో పాల్గొంటారు.
అదేవిధంగా మండలిలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. మరో ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ దానిని బలపర్చనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ తమిళిసై గురువారం ప్రసంగించిన విషయం తెలిసిందే. కాగా, నేడు మంత్రి మండలి సమావేశం కానున్నది. ఈ సందర్భంగా ఓటాన్ బడ్జెట్ అకౌంట్ పద్దులను క్యాబినెట్ ఆమోదింనుంది.