జనగామ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (TS Assembly Elections) కొనసాగుతోంది. అసహనానికి లోనవుతున్న కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణలకు ప్రేరేపించారు.
జనగామ నియోజకవర్గం లో ప్రతిపక్ష పార్టీలు బిజెపి కాంగ్రెస్ పార్టీలు ఓటమి భయంతోనే దాడులకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. గురువారం జనగామ పట్టణంలోని ప్రభుత్వ జడ్పీహెచ్ఎస్ పాఠశాల పోలింగ్ కేంద్రంలో బిజెపి కాంగ్రెస్ వర్గీయులు అభ్యర్థుల ప్రోత్బలంతో ఓటమి భయంతోనే ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసే విధంగా దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇది ప్రజాస్వామ్యానికి మంచి సంకేతం కాదని అన్నారు. ప్రతిపక్షాలు ఎలాంటి సమస్యలు సృష్టించిన పార్టీ కార్యకర్తలు శ్రేణులు సమన్వయంతో ఉండాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.
Read More :