హైదరాబాద్: ప్రయాణికులకు ముఖ్యగమనిక. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నడిచే 52 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (SCR) రద్దుచేసింది. ఈ సర్వీసులను మంగళవారం నుంచి ఈ నెలాఖరు వరకు నిలిపివేస్తున్నట్లు (Trains cancelled) తెలిపింది. ఇందులో జన్మభూమి (Janmabhoomi) ఎక్స్ప్రెస్, గరీబ్రథ్తోపాటు (Garib Rath) విశాఖ-చెన్నై, తిరుపతి-భువనేశ్వర్, హైదరాబాద్-కటక్ మధ్య నడిచే రైళ్లు కూడా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. గుండాలా-విజయవాడ సెక్షన్ పరిధిలో నాన్-ఇంటర్లాకింగ్ పనుల కారణంగా ఈ రైళ్లు రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్- విశాఖపట్నం మార్గంలో.. జన్మభూమి(12805-12806), గరీబ్రథ్ (12739-12740), రాజమండ్రి-విజయవాడ-రాజమండ్రి (07767/68), విజయవాడ-రాజమండ్రి-విజయవాడ (07459/60) రైళ్లు రద్దయ్యాయి. ఈ నెల 23 వరకు కటక్-హైదరాబాద్ (07166) రైలును రద్దు చేశారు. ఈనెల 27 వరకు కాకినాడ టౌన్-లింగంపల్లి (12775), లింగపల్లి-కాకినాడ టౌన్ (12776), విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం (12783/84) రైళ్లు రద్దయ్యాయి. ఈ నెల 29 వరకు విశాఖపట్నం-లింగంపల్లి (12805), విశాఖపట్నం-మహబూబ్నగర్ (12861) , 30వ తేదీ వరకు లింగంపల్లి-విశాఖపట్నం (12806), మహబూబ్నగర్-విశాఖపట్నం (12862) రైళ్లను రద్దు చేశారు.