హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): ఇచ్చిన మాట ప్రకారం తన సొంత నిధులతో అమ్మమ్మ-తాతయ్య జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాల నిర్మాణం పూర్తయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు. సిరిసిల్ల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొదురుపాకలో తాతయ్య జే కేశవరావు, అమ్మమ్మ లక్ష్మి జ్ఞాపకార్థం ప్రభుత్వం స్కూల్కు కొత్త భవనాన్ని కేటీఆర్ సొంత నిధులను వెచ్చించి కట్టించారు. భవన నిర్మాణం దాదాపు పూర్తయింది. చిన్న చిన్న పనులు మినహా పనులన్నీ పూర్తయ్యాయని, వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు భవనం అందుబాటులోకి వస్తుందని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. నూతన స్కూల్ భవన ఫొటోలను షేర్ చేశారు.