నిజామాబాద్ : విదేశీ కరెన్సీ మార్పిడీ పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బోధన్ ఏసీపీ రామారావు అన్నారు. ఈ సంర్భంగా ఆయన మాట్లాడుతూ..వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి చెందిన వారు విదేశీ కరెన్సీ మార్పిడీ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని ఏసీపీ వెల్లడించారు. ఇందులో భాగంగా బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఈ నెల 18న కేసు నమోదు చేసినట్లు వివరించారు.
కామారెడ్డి జిల్లా బాన్స్ వాడకు చెందిన ఎజాజ్ ఖాన్ అనే వ్యక్తికి బోధన్ లో రూ. 5లక్షల విలువైన విదేశీ కరెన్సీని రూ. 2.5 లక్షలకు ఇస్తామని నమ్మించి, 2.5 లక్షలు తీదుకుని ఓ బ్యాగ్ అందచేసి వెళ్లిపోయారు.
ఆ బ్యాగ్ తెరిచి చూడగా అందులో చిత్తు కాగితాలు, న్యూస్ పేపర్ లు ఉండడం గుర్తించిన సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు.
ఈ సంఘటన పై కేసు నమోదు చేసి విచారణ జరువుతున్నామని ఏసీపీ రామారావు వివరాలను వెల్లడించారు. ఇలాంటి సంఘటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.