న్యూఢిల్లీ, ఆగస్టు 10 (నమసే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర పరిధిలోని అంశం కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీనికి రాష్ట్రం చేసే సవరణలు చెల్లవని, పూర్తిగా కేం ద్రం, పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాల్సిన అంశమని చెప్పింది. పంజాబ్, తమిళనాడులో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమల్లో ఉన్నదని, తెలంగాణ, ఏపీలోనూ అమలు జరిగేలా తుది ఉత్తర్వులు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీ నిపై బుధవారం విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల వ్యవహారంపై కౌంటర్ పిటిషన్ దా ఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించి విచారణను వాయిదా వేసింది.