హైదరాబాద్, జనవరి 25 : రాష్ట్రంలోని ఎస్సీ ఉపకులాలకు కూడా దళిత సాధికారత పథకం ద్వారా ప్రత్యేక సాయం అందించాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్కు ఐక్యవేదిక ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం సంక్షేమభవన్లో వారు చైర్మన్ను కలిశారు. రాష్ట్రంలో 57 ఎస్సీ ఉపకులాలు, 30 లక్షల జనాభా ఉన్నదన్నారు. దళితుల సంక్షేమ పథకాలు కొన్ని ఎస్సీ కులాలకే దక్కుతున్నాయని వివరించారు. సమావేశంలో రాష్ట్ర ఎస్సీ ఉపకులాల ఐక్యవేదిక గౌరవ అధ్యక్షుడు చంద్రగిరి రాజమౌళి, సలహాదారు ప్రొఫెసర్ చింతల యాదయ్య, రాష్ట్ర అధ్యక్షుడు చింతల రాజలింగం, ఇతర నేతలు పాల్గొన్నారు.
రవిదాస్ జయంతి అధికారికంగా నిర్వహించాలి
కులవ్యవస్థపై అవిశ్రాంతంగా పోరాడి, భక్తి ఉద్యమాన్ని నడిపిన సంత్ శిరోమణి గురు రవిదాస్ మహరాజ్ జయంతిని ఫిబ్రవరి 16న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బండ శ్రీనివాస్కు మాదిగ మేధావుల ఫోరం విజ్ఞప్తి చేసింది.