హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకొచ్చిన 40 రోజులకే తెలంగాణకు నష్టం చేసే నిర్ణయా లు తీసుకోవడం బాధాకరమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. యూటర్న్లు తీసుకొంటున్నదని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ పదేండ్లలో ప్రాజెక్టులు కేంద్రం చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకొన్నారని గుర్తుచేశారు. ఇదే విషయాన్ని మినిట్స్ రికార్డులు చూసి తెలుసుకోవాలని సూచించారు. ‘తెలంగాణను ఈ అనుభవ రాహిత్య, అవగాహన లోప, అహంకార పూరిత ప్రభుత్వం నుంచి కాపాడండి’ అని ఎక్స్వేదికగా ఆయన పిలుపునిచ్చారు.