మహబూబాబాద్ రూరల్, ఏప్రిల్ 23: కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజలకు కష్టాలు తెచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్ ఎంపీ క్యాంప్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి మాలోత్ కవిత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ నేతృత్వంలో గిరిజనులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని చెప్పారు. ఈ ప్రాంతంలో గిరిజనుల కోసం మెడికల్ కళాశాల, హార్టికల్చర్, నర్సింగ్, ఇంజినీరింగ్ కళాశాలను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసి ప్రజలను నట్టేట ముంచిందని, తండాల్లో ప్రతి ఒక్కరూ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే సీఎం రేవంత్రెడ్డిపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. వివిధ మతాల మధ్య బీజేపీ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ మండు వేసవిలో ఎస్సారెస్పీ కాలువల ద్వారా చెరువులను నింపిన ఘనత కేసీఆర్దేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్లు అంగోతు బిందు, బడే నాగజ్యోతి, మాజీ ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, బానోత్ శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, హరిప్రిచినాయక్, రేగా కాంతారావు తదితరులు పాల్గొన్నారు.