హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా గిరిజనులను మోసం చేసిందే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్ని మిషన్లు చేపట్టినా ఆయన గాలిమాటలు నమ్మే స్థితిలో ఆదివాసీ, గిరిజనులు లేరని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో సీఎం కే చంద్రశేఖర్రావు నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభు త్వం ఆదివాసీ, గిరిజనుల ఆత్మగౌరవాన్ని సమున్నతంగా నిలిపిందని పేర్కొన్నారు. గిరిజన జీవితాలను బాగుచేయాలనే సంకల్పంతో గత ఏడేండ్లల్లో సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల జీవితాలను బాగుచేస్తుంటే, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వారి జీవితాలను దుర్భరంగా మార్చేస్తున్నదని మండిపడ్డారు. గురువారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్, రవీంద్రకుమార్తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. అదేపనిగా గాలి మాటలు మాట్లాడితే గిరిజన ప్రాంతాల్లో ఏ బీజేపీ నాయకుడినీ తిరగనివ్వబోమని హెచ్చరించారు. గిరిజన, దళిత నియోజకవర్గాల్లో పట్టుకోసం ప్రత్యేక మిష న్ల పేరుతో ప్రచారం చేసుకొంటున్న బీజేపీ, కేంద్రంలో గత ఏడేండ్ల పాలనలో ఆ వర్గాలకు చేసిన మేలేమిటో చెప్పాలని డిమాండ్చేశారు.
దీర్ఘకాలంగా కొనసాగుతున్న గిరిజనుల పోడు భూముల సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్ ప్రత్యే క చొరవ తీసుకొన్నారని మంత్రి సత్యవతి తెలిపారు. అర్హులైన గిరిజనులకు భూ హకుల కల్పన కోసం దరఖాస్తులు తీసుకొన్నారని, త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. పోడు చట్టం ఉన్నది కేంద్రప్రభుత్వ పరిధిలోనే అన్న కనీస అవగాహన కూడా బండి సంజయ్కి లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్రం లో గిరిజన జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని సీఎం కేసీఆర్ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడమే కాకుండా, స్వయంగా ప్రధాని మోదీని కలి సి విన్నవించినా ఇంతవరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఏపీ పునర్విభజన చట్టం లో హామీ ఇచ్చినా కేంద్రం ఎందుకు కేటాయించలేదని నిలదీశారు. ఈ వర్సిటీ కోసం ములుగు జిల్లా జాకారంలో 350 ఎకరాల స్థలాన్ని కేటాయించటమే కాకుం డా, పక్కా భవనాలు నిర్మించేదాకా గిరిజన వైటీసీ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్నా కేంద్రం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఏపీలో మాత్రం రెండు గదులు కేటాయిస్తే వర్సిటీ ప్రారంభించి, తెలంగాణపై వివక్ష చూపుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆదివాసీ, గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు విలువ ఇచ్చి కాపాడుతున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మంత్రి సత్యవతి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నిర్వహించిన మొదటి మేడారం జాతరకు రూ.332 కోట్లు కేటాయించామని, కుమ్రంభీం, సేవాలాల్ మహారాజ్ జయంతులను అధికారికంగా నిర్వహిస్తున్నామని గుర్తుచేశారు. ఆసిఫాబాద్ జిల్లాలోని జోడేఘాట్లో కుమ్రం భీం మ్యూజియం, హైదరాబాద్ నడిబొడ్డున వందల కోట్ల విలువచేసే ఖరీదైన భూమిని కేటాయించి ఆదివాసీ గిరిజన భవనాలను నిర్మించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. ప్రతి నియోజకర్గ కేంద్రంలో గిరిజన భవనాలను నిర్మిస్తూ గిరిజనుల పట్ల అత్యంత ప్రేమను ప్రదర్శిస్తున్నది సీఎం కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. ‘మా తండాలో మా రాజ్యం’ కావాలని దశాబ్దాలుగా గిరిజనులు పోరాటం చేసినా ఎవరూ పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ తండాలను ఒకేసారి గ్రామ పంచాయతీలుగా ఏర్పాటుచేసి గిరిజనులకు స్వయంపాలన హక్కు కల్పించారని తెలిపారు. బీజేపీ నేతలు ఎన్ని వేషాలు వేసినా గిరిజన నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా రావని స్పష్టంచేశారు.
ఫాల్తు మాటలు ఇప్పటికైనా బంద్ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి ఎంపీ మాలోత్ కవిత సూచించారు. గిరిజన నియోజకవర్గాల సమావేశాన్ని బండి సంజయ్ హైదరాబాద్లోని గచ్చిబౌలి హోటల్లో పెట్టినప్పుడే బీజేపీకి గిరిజనుల పట్ల ఉన్న ప్రేమ ఏ పాటిదో తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. గిరిజన ప్రాంతాలకు న్యాయం చేసిన మహాత్ముడు సీఎం కేసీఆర్ అని అన్నారు. మేడారం సమ్మ క సారక జాతరకు కేంద్రం నుంచి రూ.వెయ్యి కోట్లు తీసుకొస్తే సంజయ్కి దండ వేసి సన్మానిస్తామని అన్నారు. రాష్ట్రంలోని గిరిజన నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా బీజేపీ గెలవదని తేల్చిచెప్పారు. బీజేపీకి ఎన్నికలప్పుడే గిరిజనులు గుర్తుకొస్తారని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మండిపడ్డారు. గిరిజనుల గురించి మాట్లాడే నైతిక హక్కును బీజేపీ కోల్పోయిందని స్పష్టంచేశారు. బీజేపీ ఎంపీ సోయం బాపూరావు ఆదివాసీ, గిరిజనుల మధ్య చిచ్చుపెడుతూ వైషమ్యాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని 12 ఎస్టీ నియోజకవర్గాల్లో బీజేపీకి ఉన్న ఎంపీటీసీలు, సర్పంచ్లు ఎందరని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ప్రశ్నించారు. బండి సంజయ్ ఎన్ని కలలు కన్నా 12 గిరిజన నియోజకవర్గాల్లో బీజేపీకి డిపాజిట్లు రావని తేల్చి చెప్పారు. ఏమి చేశారని గిరిజనులు బీజేపీని ఆదరిస్తారని నిలదీశారు.
గిరిజనుల ఓట్ల కోసం బీజేపీ నేతలు కొత్త డ్రామాలు మొదలు పెట్టారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరెడ్డి విమర్శించారు. కేంద్రం గిరిజన రైతులను పట్టించుకోకపోయినా రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకొంటున్నదని తెలిపారు. రైతుబంధు పథకం కింద గిరిజన రైతులకు రూ.1,200 కోట్లు చెల్లించామని వివరించారు. సింగిల్ ఫేజ్ కరెంట్ ఉన్న గిరిజన ప్రాంతాలన్నింటినీ రూ.250 కోట్లతో త్రీ ఫేజ్గా మార్చామని చెప్పారు. పోడు భూముల హకుల కోసం నాలుగున్నర లక్షల మంది 12 లక్షల ఎకరాల కోసం దరఖాస్తు చేసుకొన్నారని తెలిపారు. బీజేపీ నేతలకు చేతనైతే కేంద్రం పరిధిలోని పోడు భూముల సమస్య పరిష్కారానికి కృషిచేయాలని సూచించారు. సంజయ్కి దమ్ముంటే పార్లమెంటులో ఈ సమస్యపై కేంద్రాన్ని ప్రశ్నించాలని డిమాండ్చేశారు. రాష్ట్రంలోని గిరిజనులకు రిజర్వేషన్ల ప్రయోజనాలు దకకుండా బీజేపీ కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. గిరిజన యువతకు ఉద్యోగాలు రాకుండా ప్రభుత్వ సంస్థలన్నింటినీ కేంద్రం ప్రైవేటీకరిస్తున్నదని విమర్శించారు. ఈ విషయంలో గిరిజన తండాలు, ఆదివాసీ గూడేల్లోని యువత బీజేపీపై తిరుగుబాటు చేస్తుందని హెచ్చరించారు.