దుబ్బాక, సెప్టెంబర్ 9: దుబ్బాకలో బీజేపీకి మరోసారి భారీ షాక్ తగిలింది. ఇటీవల దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక, దౌల్తాబాద్, మిరుదొడ్డి, అక్బర్పేట-భూంపల్లి, చేగుంట మండలాల్లో బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
తాజాగా శనివారం అక్బర్పేట-భూంపల్లి మండలంలోని పోతారెడ్డిపేట గ్రామానికి చెందిన బీజేపీ సర్పంచ్ పుట్ల శంకరయ్యతో పాటు సుమారు 30 మంది ఆ పార్టీ నాయకులు ఎంపీ ప్రభాకర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎంపీ గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి స్వాగతించారు. కార్యక్రమంలో అక్బర్పేట-భూంపల్లి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు జీడిపల్లి రవి, డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, బీఆర్ఎస్ నాయకులు రొట్టే రాజమౌళి, కృష్ణ, శ్రీనివాస్గౌడ్ తదితరులు
పాల్గొన్నారు.