తిమ్మాపూర్ రూరల్, జూన్ 22: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ సర్పంచ్ రావుల రమేశ్ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో ఎవరింట్లో ఆడపిల్ల పుట్టినా రమేశన్న కానుక పేరుతో ఆ బిడ్డ పేరిట రూ.5,116 ఫిక్స్డ్ డిపాజిట్ చేసి తల్లిని నామినీగా నమోదు చేసి బాండ్ అందిస్తున్నారు.
రమేశన్న కానుక పథకం గతేడాది దసరా నుంచి ప్రారంభం కాగా ఇప్పటివరకు పదిమంది ఆడపిల్లలు జన్మించగా వారందరి పేరుమీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. బుధవారం గ్రామ పంచాయతీ ఆవరణలో డిపాజిట్ బాండ్లను వారికి అందజేశారు.