సిరిసిల్ల టౌన్/వేములవాడ ఫిబ్రవరి 15: తెలంగాణ ప్రజల ఆశీస్సులతో సీఎం కేసీఆర్ నిండు నూరేండ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం బొగడ భూపతిపూర్ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయన ఈ నెల 13న కుమ్రంభీం జిల్లా జోడెఘాట్ నుంచి ప్రారంభించిన పాదయాత్ర బుధవారం వేములవాడ మీదుగా సిరిసిల్లకు చేరుకున్నది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఈ నెల 17న హైదరాబాద్కు చేరుకొని సీఎం కేసీఆర్ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తానన్నారు. లక్ష్మీనారాయణ పాదయాత్రకు వేములవాడ, సిరిసిల్లలో బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.