హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): ఆల్ ఇండియా సమతువ మకల్ కచ్చి పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు శరత్కుమార్ శనివారం హైదరాబాద్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో భేటీ అయ్యారు. ఆమె నివాసంలో దేశ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను శరత్కుమార్ అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి సర్కారు ఇస్తున్న ప్రాధా న్యం, ఫలితాలను ఎమ్మెల్సీ కవిత వివరించారు. బీఆర్ఎస్ స్థాపన ఉద్దేశాలు, లక్ష్యాలు, ఎజెండా వంటి అంశాల గురించి శరత్కుమార్ అడిగి తెలుసుకున్నారు.