హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం వద్ద సరస్వతీ అంత్యపుషరాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. పుషరాల తొలిరోజు తెల్లవారుజామున 5:43 గంటలకు కంచి పీఠాధిపతి జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సరస్వతీ, గవర్నర్ శివప్రతాప్ శుక్లా పుషరస్నానం చేసి అంత్య పుషరాలను లాంఛనం గా ప్రారంభించనున్నారు. 12 రోజుల పాటు(జూన్ 1 వరకు) జరిగే పుషరాలకు 30 నుంచి 40 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు అంచనా. పుషరాల పనుల కోసం ప్రభుత్వం రూ. 30.63 కోట్లు కేటాయించింది. ప్రతీరోజూ ఉదయం హో మాల నిర్వహణ, సాయంత్రం పెద్దఎత్తున సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సరస్వతీ అంత్య పుషరాలను భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుపుకోవాలని సీఎం రేవంత్ సూ చించారు. పుషరస్నానాలు ఆచరించేందుకు తరలివచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.