జగిత్యాల, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రా..? రియల్ ఎస్టేట్ బ్రోకరా..? అని కోరుట్ల ఎమ్మె ల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రెండేండ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇక్కడి సహజవనరులను దోచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశానికి స్వాతం త్య్రం రాక ముందు ఇక్కడి సంపదను బ్రిటిషోళ్లు దోచుకుంటే, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెసోళ్లు దోచుకోవడం మొదలు పెట్టారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పేరుతో కేసీఆర్, కేటీఆర్ను దూషిస్తూ ప్రజల దృష్టిని మళ్లించి రాష్ట్ర భూములను దోచుకుంటున్నదని విమర్శించారు. హైదరాబాద్లో అత్యంత విలువైన భూములను కారుచౌకగా రియల్ ఎస్టేట్ వాళ్లకు దోచిపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో ఫార్మా సిటీకి సంబంధించి సేకరించిన 14వేల ఎకరాల భూ మిని ఫ్యూచర్సిటీ పేరిట విక్రయానికి పెడుతున్నారని ఆరోపించారు. కంచె గచ్చిబౌలి వద్ద 400 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు తన అనుయాయులకు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంలో రూ.40వేల కోట్ల స్కామ్ చేస్తున్నారని ఆరోపించారు. మెట్రో రైలుకు సంబంధించి ఎల్అండ్టీ సంస్థ నిర్వహించాల్సిందని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడంవల్ల రూ.11వేల కోట్ల అదనపు భారం తెలంగాణ ప్రజలపై పడుతుందని చెప్పారు.
మెట్రో ఆధీనంలో ఉన్న 280 ఎకరాలకు సంబంధించిన భూములపై రేవంత్రెడ్డి కన్నేసి ఈ దారుణానికి ఒడిగడుతున్నారని చెప్పారు. రాంచంద్రాపూర్, ఉప్పల్, కూకట్పల్లి, నాచారం, బాలానగర్, పటాన్చెరు పరిధిలో ఉన్న 10వేల ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు తన మనుషులకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. రూ.5 లక్షల కోట్ల విలువ చేసే భూములను రూ.5 వేల కోట్లకు అప్పగించాలని చూ స్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో టీఎస్ఐపాస్ తెచ్చి భూములను కేటాయించడంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించారని గుర్తుచేశారు. వీటివల్ల లక్షలాది మంది యువతకు ఉపాధి లభించిందని, రా్రష్ట్ర ఆదాయం పెరిగిందని తెలిపారు. టీఎస్ఐపాస్ దరఖాస్తుల్లోనూ భూముల కేటాయింపు సమయంలో టీజీఐఐసీ నిర్దేశిత ధరల కంటే 300 రెట్లు అధిక ధరలు చెల్లించాలని నిర్ణయించారన్నారు. ఈ విధానానికి మంగళంపాడి సీఎం రేవంత్రెడ్డి సర్కార్ ఎస్ఆర్వో ధరల్లో ముప్పై శాతానికి భూముల కేటాయింపులకు తెగబడడం అన్యాయం అని ధ్వజమెత్తారు. హైదరాబాద్లో ధర ఎకరం రూ.170 కోట్లు పలుకుతున్న తరుణంలో పదివేల ఎకరాల భూమి కే వలం 5వేల కోట్లకు విక్రయించాలని చూడడం అతి దారుణం అని మండిపడ్డారు. ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరిట మొదలు పెట్టిన ఈ భూముల విక్రయ స్కామ్లో ఐదు లక్షల కోట్ల స్కామ్ దాగి ఉందని ఆరోపించారు. ఈ స్కా మ్పై అప్రమత్తం కావడంతోపాటు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.