హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు గురువారం తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిని, శాసనసభాపతి గడ్డం ప్రసాద్కుమార్ను వారివారి నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా మండలి చైర్మన్కు, అసెంబ్లీ స్పీకర్కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. అనంతరం వారు సీఎస్ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సర్ గడ్డం అనన్య తదితరులు పాల్గొన్నారు.