మోటకొండూర్, జనవరి 11: స్వచ్ఛ భారత్కు అసలు రూపమైన పారిశుధ్య కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ డిమాండ్ చేశారు.
డప్పు, చెప్పు వృత్తిదారులకు నెల నెలా పెన్షన్ ఇవ్వాలని, పారిశుధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని ఫిబ్రవరి 29న చేపట్టనున్న చలో హైదరాబాద్ పోరుగర్జన కరపత్రాలను గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండల కేంద్రంలో ఆవిష్కరించారు.