సంగెం/సుబేదారి, సెప్టెంబర్ 23: లంచం తీసుకొంటూ తాసిల్దార్ ఏసీబీకి చిక్కాడు. వరంగల్ జిల్లా సంగెం తాసిల్దార్గా పనిచేస్తున్న రాజేంద్రనాథ్.. శుక్రవారం తన ఇంట్లో రూ.40 వేలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డాడు. పర్వతగిరి మండలం చింతనెక్కొండకు చెందిన నల్లపు కుమార్కు సంగెం మండలంలోని ఆశాలపల్లి గ్రామశివారులోని కాపులకనపర్తి రెవెన్యూ పరిధిలో 274/2లోని 1.38 గుంటలు, 274/బిలో 1.30 గుంటల భూమి ఉన్నది.
ఎకరం భూమిని తన సోదరి ఆకుల అనిత పేరు మీద గిఫ్ట్ డీడ్ చేయాలని 4 నెలలుగా తిరుగుతున్నాడు. లక్ష ఇస్తే చేస్తానని చెప్పాడు. చివరకు రూ.40 వేలకు అంగీకరించాడు. శుక్రవారం హనుమకొండలోని నందినీహిల్స్లోని తన నివాసంలో తాసిల్దార్ రాజేంద్రనాథ్.. కుమార్ నుంచి డబ్బులు తీసుకొంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం ఏసీబీ అధికారులు సంగెం తాసిల్దార్ కార్యాలయానికి రాజేంద్రనాథ్ను తీసుకొచ్చి 5 గంటలపాటు సోదాలు జరిపారు.