సదాశివపేట, సెప్టెంబర్ 11: సంగారెడ్డి నియోజకవర్గంలోని బీజేపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. సదాశివపేట మండలం మద్దికుంట చౌరస్తా వద్ద ఆదివారం బీజేపీ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రకు మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ సీనియర్ నాయకుడు రామచంద్రారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఫ్ల్లెక్సీల్లో తమ నాయకుడి ఫొటో లేదని సంగారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి రాజేశ్వర్రావు దేశ్పాండే అనుచరులు జిల్లా అధ్యక్షుడు నరేందర్రెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు ఎదుటే ఇరువర్గాల వారు అంగీలు చింపుకోవడం, నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో వాదులాడుకోవడం గమనార్హం.