కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో ఇసుక మాఫియా హల్చల్. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి వెళ్లిన అటవీ సిబ్బందిపై దాడిచేశారు. రెండు ట్రాక్టర్లను అడ్డుకోవడానికి యత్నించిన అటవీ సిబ్బంది కారును ఢీకొట్టి అక్కడి నుంచి పారిపోవడానికి ట్రాక్టర్ డ్రైవర్ ప్రయత్నించారు. దీంతో కారు ధ్వంసమవగా, అటవీ సిబ్బంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే ట్రాక్టర్లను వెంబడించిన అధికారులు.. పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.