Saleshwaram Jatara | చుట్టూ అడవి.. కొండలు.. కోనలు.. జలపాతాలు. ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయ గుహలో వెలసిన లింగమయ్య దర్శనం సోమవారం నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 24వ తేదీ వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులను అడవిలోకి అనుమతించనున్నట్టు అధికారులు ప్రకటించారు.
ఈ జాతర తెలంగాణ అమరనాథ్ యాత్రగా ప్రత్యేక గుర్తింపు పొందిందని, ఏటా మూడురోజులు మాత్రమే ఇక్కడ జాతర జరుగుతుందని తెలిపారు. భక్తులు కిలోమీటర్ల మేర కాలినడకన కొండలు, గుట్టలు దాటుకుంటూ సలేశ్వరం గుడివద్దకు సాహసయాత్ర చేయాల్సి ఉంటుంది.
-అచ్చంపేట