హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): రేపటి నుంచి బాచుపల్లి హెచ్ఎండీఏ ప్లాట్లను ఆన్లైన్లో విక్రయిస్తున్నట్టు అధికారులు తెలిపారు. నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని బాచుపల్లిలో 27 ఎకరాల స్థలంలో లేఅవుట్ను అభివృద్ధి చేసి, ఆన్లైన్లో విక్రయించేందుకు సిద్ధం చేశారు. గురు, శుక్రవారాల్లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ప్లాట్ల ఆన్లైన్ విక్రయాన్ని నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. మొత్తం 73 ప్లాట్లను విక్రయించనున్నామని, చదరపు గజానికి రూ.25 వేలు కాగా, వేలంలో కనీసం రూ.500 పెంచాలని నిర్ణయించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఆన్లైన్ వేలం ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీకి బాధ్యతలు అప్పగించామని, రిజిస్ట్రేషన్ నుంచి మొదలు కొని అన్ని వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.