హైదరాబాద్ : గ్రీన్ ఇండియా సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్కు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీవాసుదేవ్ ఆదివారం లేఖ రాశారు. దేశంలో 52శాతం వ్యవసాయ భూములు నిస్సారమయ్యాయని, దేశంలో మట్టి క్షీణత తీవ్రమైన సమస్యగా మారిందని లేఖలో పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మనం మన నేలను కాపాడుకోకపోతే.. దేశంలో వ్యవసాయ సంక్షోభం సంభవించే ప్రమాదం ఉందంటూ.. ‘సేవ్ సాయిల్ మూమెంట్’ సాధించిన ప్రగతిని వివరించారు.
ఈ జఠిలమైన నేలనిస్సార సంక్షోభ సమస్యకు పరిష్కారం చూపించేందుకు తాను యూరప్లో మొదలుపెట్టి సెంట్రల్ ఆసియా, మిడిల్ ఈస్ట్, ఇండియాలలో వంద రోజుల్లో 30వేల కిలోమీటర్లు బైక్ ర్యాలీ చేసి 3.9 బిలియన్ల ప్రజలకు ‘సేవ్ సాయిల్’ సందేశం చేరవేసినట్టు లేఖలో ఆయన తెలిపారు. నేలను కాపాడేందుకు ‘దేశంలో రైతులు వ్యవసాయంలో 3నుంచి 6శాతం సేంద్రియ పద్ధతులను అనుసరించేలా చేయడం.
రైతులకు కార్బన్ క్రెడిట్ ఇన్సెంటీవ్స్’ అందించేందుకు కృషిచేయడం, పండిన పంట పోషకాల ఆధారంగా కాకుండా.. అవి పండించిన నేలలోని సేంద్రియ లెక్కల ఆధారంగా లేబుల్ చేయడం’ అనే మూడు ఆశయాలతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్టు సద్గురు పేర్కొన్నారు.
అంతేకాకుండా ‘సేవ్ సాయిల్’ మూవ్మెంట్ను మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఎంపీ సంతోష్ కుమార్ నుంచి మరింత సహకారం ఆశిస్తున్నట్టు లేఖలో తెలిపారు. సద్గురు లేఖపై స్పందించిన సంతోష్ కుమార్.. ‘సేవ్ సాయిల్’ మూమెంట్ అద్భుతమైన కార్యక్రమమని.. అందుకే హైదరాబాద్లో సద్గురు నిర్వహించిన కార్యక్రమంలో ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ను భాగం చేసినట్టు పేర్కొన్నారు. మట్టిని కాపాడాలంటే మొక్కలు నాటడం ఒక్కటే పరిష్కారమని సంతోష్ పేర్కొన్నారు.