హైదరాబాద్ : సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా,కేంద్రమంత్రిగా పనిచేసిన ములాయం సింగ్ తన జీవితాంతం నిరుపేద బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే పని చేశారన్నారు.
చివరి క్షణం వరకు ప్రజా క్షేత్రంలో ఉండి సేవ చేసి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల అభిమానాన్ని పొందరన్నారు. ములాయం సింగ్ కుమారుడు అఖిలేష్ యాదవ్తో పాటు వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.స్వర్గీయ ఇంద్రన్నతో ములాయం సింగ్కు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. ఆ ఫోటోను మంత్రి షేర్ చేసుకున్నారు.