సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 22: రైతుబంధు పథకంలో భాగంగా యాసంగి పెట్టుబడి సాయాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతులకు ముందస్తుగా ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం కేసీఆర్ ఈనెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతు బంధు పెట్టుబడి సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే మంత్రి కేటీఆర్ ఇటీవల సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో పర్యటించగా, రైతుల విజ్ఞప్తి మేరకు వారం రోజుల ముందే ఈ నెల 21 నుంచి నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమవుతుండడంతో రైతులు, ప్రజాప్రతినిధులు, నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు.