Palla Rajeshwar reddy | హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): దేశానికి కొత్త దశ, దిశను చూపేది బీఆర్ఎస్సేనని, దేశ నిర్మాణంలో బీజేపీ, కాంగ్రెస్ విఫలమయ్యాయని రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ పల్లా మాట్లాడారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా దేశం నీళ్లు, విద్యుత్తు, ఆహార కొరతతో అలమటించడం దారుణమని, నాయకత్వలేమి దీనికి కారణమని.. కేసీఆర్ వంటి విజనరీతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలి పారు.
విద్యుత్తు, వ్యవసాయం, నీటిపారుదల లో తెలంగాణ రోల్మాడల్గా ఉన్నదని, బీఆర్ఎస్ కేం ద్రంలో అధికారంలోకి వచ్చా క ఈ మూడింటిపై సమగ్ర విధానాన్ని సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. సింగపూర్కు లీక్వా న్ యీ, చైనాకు డెంగ్ జియావో పింగ్, జపాన్కు షింజో అబే, మలేషియాకు మెహతీర్ మహ్మద్లా తెలంగాణను కేసీఆర్ తీర్చిదిద్దారని పేర్కొన్నారు. వ్యవసాయంలో దేశంలోనే తెలంగాణ నంబవర్వన్గా ఉన్నదని, రైతు బంధు, రైతుబీమాను అనేక రాష్ర్టాలు అనుసరిస్తున్నాయని చెప్పారు.విద్యుత్తు రంగంలో తెలంగాణ అద్భుతాలు సృష్టించిందన్నారు.