మెదక్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఎవరెన్ని ట్రికులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది సీఎం కేసీఆరేనని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. బుధవారం ఆయన మెదక్ జిల్లా పాపన్నపేట, హవేలీఘనపూర్, మెదక్, మెదక్ పట్టణం, చిన్నశంకరంపేట, రామాయంపేట మండలాల్లో కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, మెదక్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ… బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. రేషన్కార్డు ఉన్న వాళ్లకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వబోతున్నామని, ఇందుకు ఏటా రూ.1,300 కోట్లు ఎకువ ఖర్చు అవుతుందని, అయినా అయినా వెనుకాడేది లేదని తెలిపారు. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రాగానే రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, సౌభాగ్యలక్ష్మి ద్వారా మహిళలకు రూ.3వేలు అందజేస్తామని భరోసా ఇచ్చారు. ఆసరా పింఛన్లను విడతలవారీగా రూ.5వేలకు పెంచనున్నట్టు సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో ప్రకటించారని, అధికారంలోకి రాగానే అమలు చేస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.15 లక్షల వరకు ఉచిత వైద్యం అందించనున్నట్టు వెల్లడించారు.
ఎన్ని ఎకరాలు ఉన్నా కాంగ్రెస్ ఇచ్చేది 15 వేలే
రైతుబంధు సృష్టికర్త సీఎం కేసీఆర్ అని, రైతుకే డబ్బు ఇచ్చిన ఒకే ఒకడు కేసీఆర్ అని మంత్రి హరీశ్రావు చెప్పారు. రైతుబంధు ద్వారా ఎకరాకు ఏటా రూ.10 వేల చొప్పున కేసీఆర్ ప్రభుత్వం అందజేస్తున్నదని గుర్తుచేశారు. మూడోసారి అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.16 వేలు ఇస్తామని, అదే కాంగ్రెస్ ఎన్ని ఎకరాలు ఉన్నా రూ.15వేలు ఇస్తామని అంటున్నదని, దీనిని రైతులు ఆలోచించాలని సూచించారు. కర్ణాటకలో 5 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నామని ఒప్పుకొని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నెత్తిన పాలు పోసిండని అన్నారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రైతుల నుంచి ఎకరాకు కేవలం 13 క్వింటాళ్ల వడ్లు కొంటున్నదని, మిగతావి కొనరని తెలిపారు. తెలంగాణలో రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో సేకరిస్తున్నదని చెప్పారు. ఈసారి అధికారంలోకి రాగానే అసైన్డ్ భూములకు పూర్తి హకులు ఇవ్వబోతున్నామని, తద్వారా లబ్ధిదారులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాలను ఆర్థికంగా పరిపుష్టం చేసిన బీఆర్ఎస్కు ఓటేసి కేసీఆర్ను మూడోసారి సీఎం చేయాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కష్టపడి పద్మా దేవేందర్రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.