హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): ఈ వానకాలం నుంచే రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.7,500 అందజేయాలని మాజీ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. ఇంతకీ రాష్ట్రంలో రైతుకు ‘భరోసా’ ఉన్నట్టా? లేనట్టా? అని ప్రశ్నించారు. రైతుభరోసా విధివిధానాల రూపకల్పనకు ఏడు నెలల నుంచి ముఖ్యమంత్రి, మంత్రులకు తీరికలేదా? అని నిలదీశారు.
ఏ పథకం గురించి అడిగినా ముఖ్యమంత్రి, మంత్రులు ‘ఓ స్త్రీ రేపురా’ అని రాసి ఉండే కథను వినిపిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్రెడ్డికి ఎన్నికల ప్రచారంలో ఉన్న సోయి విధివిధానాల రూపకల్పనలో లేదని మండిపడ్డారు. రైతుభరోసా విషయంలో రైతుబంధు పథకాన్ని సమీక్షిస్తామనిగానీ, కుదింపు చేస్తామనిగానీ కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో ఎందుకు చెప్పలేదని బుధవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
దమ్ముంటే విధాన ప్రకటన చేయాలి..
‘రైతుభరోసాకు దికు లేదు. కౌలు రైతుల ఊసులేదు. రైతు కూలీల గురించి పట్టించుకున్న నాథుడే లేడు. వరికి రూ.500 బోనస్ వట్టి బోగస్ అని తేలిపోయింది’ అని నిరంజన్రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే రైతుభరోసాను 5 ఎకరాలకో, 10 ఎకరాలకో పరిమితం చేస్తామని విధాన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కాలయాపన కోసమే శాసనసభ సమావేశాలు అంటూ ఊదరగొడుతున్నదని విమర్శించారు.
రైతుభరోసా విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేయాలని సూచించారు. రైతుబీమా ఉంచుతారా? ఎత్తేస్తారా? తేల్చి చెప్పాలన్నారు. రైతుకూలీలకు రూ.12,000, కౌలు రైతులకు రూ.15,000 ఇవ్వడంపై స్పష్టతనివ్వాలని, అబద్ధపు హామీలతో అధికారం దకించుకున్న కాంగ్రెస్ రాష్ట్ర రైతాంగాన్ని నిలువునా ముంచుతున్నదని ఆరోపించారు.