బచ్చన్నపేట: తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం అమలవుతున్న రైతుబంధు పథకం భేష్ అంటూ.. కొందరు మహిళలు సీఎం కేసీఆర్పై తమ అభిమానాన్ని పిండి వంటల రూపంలో చూపించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేటలో గ్రామ సంఘం అధ్యక్షురాలు మేకల కవిత, అంగన్వాడీ టీచర్ కాంసాని వసుమతి, మరో మహిళా సంఘం ప్రతినిధి కాంసాని లత శుక్రవారం సీఎం కేసీఆర్, రైతుబంధు అక్షరాలతో సకినాలు తయారు చేసి ఆకట్టుకున్నారు.