Minister KTR | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): దేశ వ్యవసాయ రంగ చరిత్రలో రైతుబంధు పథకం శాశ్వతంగా నిలిచిపోతుందని పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. రైతుబంధు పథకం ప్రారంభించి ఐదేండ్లు పూర్తయిన సందర్భం గా రాష్ట్ర రైతాంగానికి బుధవారం ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రైతే పాలకుడుగా ఉన్న అపూర్వమైన సందర్భం తెలంగాణలో ఉన్నదని, అందువల్లే రైతుల కష్టసుఖాలు పూర్తిగా అర్థం చేసుకొని రైతుబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ అమల్లోకి తెచ్చారని కొనియాడారు. వ్య వసాయ రంగ అభివృద్ధికి నిత్యం శ్రమిస్తున్న కేసీఆర్కు రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. రైతుబంధు పథకంతో రాష్ట్ర వ్యవసాయ రంగ ముఖచిత్రం మారిపోయిందని పేర్కొన్నారు. వ్యవసాయం దండగ అన్న గత పాలకుల ఆలోచనా విధానాలకు భిన్నంగా వ్యవసాయాన్ని కేసీఆర్ పండుగ చేశారని అ న్నారు.
‘రైతుబంధు ద్వారా ఎకరానికి ఏటా రూ.10 వేల చొప్పున 70 లక్షల మంది రై తులకు రాష్ట్ర ప్రభుత్వం 10 విడుతల్లో రూ.65,500 కోట్లు అందించింది. దేశ చరిత్రలో రైతులకు ఇంత భారీ ఎత్తున పెట్టుబడి సాయాన్ని అందించిన ప్రభుత్వం మరెక్కడా లేదు. రైతులకు రైతుబంధు ద్వారా ఆర్థిక మద్దతు అందించడంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని రికార్డు సమయంలో పూర్తి చేసింది. పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేసి నదీ జలాలను సంపూర్ణంగా వినియోగించుకోవాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాల వల్ల లక్షలాది ఎకరాల భూమి కొత్తగా సాగులోకి వచ్చింది. దీంతోపాటు సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు వేదికల నిర్మాణం, రైతుబీమా, ధాన్యం కొనుగోళ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే రైత న్న కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలకు కొదవేలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యవసాయాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తాం’ అని కేటీఆర్ తెలిపారు.